Tuesday, 14 April 2026 05:39:27 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 13 April 2026 10:22 PM Views : 11

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 13 : మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు.. మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ (FAC) చంద్రశేఖర్ రెడ్డి, జి ఎస్ డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ ల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని, గ్రీవెన్స్ పై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను గడువులోపు అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు

మదనపల్లి మండలం రామిరెడ్డి లేఅవుట్ నీరుగెట్టిపల్లి ఏడవ క్రాస్ కి చెందిన బండ లక్ష్మీదేవి తన భర్త మరణించి దాదాపు రెండు సంవత్సరాలు అయిందని కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉందని తమకు ఎలాంటి ఆధారము లేదని ప్రభుత్వం ద్వారా వితంతు పింఛను మంజూరు చేయాలని దరఖాస్తును సమర్పించారు. కురబలకోట మండలం తేట్టు గ్రామపంచాయతీ పరిధిలోని పూజారి వారి పల్లి కు చెందిన గుర్రాల వెంకటలక్ష్మి నా భర్త మరణించాడని, తర్వాత మా పిల్లలు కూడా మరణించారు. ఇద్దరు మనవళ్లు కలిసి జీవనం సాగిస్తున్నాము. నలుగురు సభ్యుల పేర్లపై కొత్త రేషన్ కార్డు మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్నారు. నిమ్మనపల్లి మండలం వెంగలవారి పల్లెకు చెందిన కె.రమణ తనకు పక్షపాతం తో కాలు చేయి పడిపోయిందని ప్రభుత్వం ద్వారా వికలాంగ పింఛను మంజూరు చేయాలని దరఖాస్తును సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై మొత్తంగా 392 అర్జీలను దరఖాస్తుదారులు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :