Monday, 08 June 2026 08:27:10 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు సాగు భూమిని పంపిణీ చేయాలి - సీపీఐ

జనవరి 4న జరిగే భూ పోరాట సదస్సును జయప్రదం చేయండి - సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప

Date : 03 December 2025 10:51 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - డిసెంబర్ 03: బి.కొత్తకోట మండలంలోని బీరంగి గ్రామంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, అగ్రవర్ణ పేదలు తదితర భూమిలేని వ్యవసాయ కూలీలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు ఎకరాలు చొప్పున సాగు భూమిని పంపిణీ చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఉదయం 11 గంటలకు బీరంగి గ్రామంలోని మొరవపల్లి ఎస్సీ కాలనీ నందు, సిపిఐ బీరంగి శాఖ సమావేశం, శాఖ కార్యదర్శ పి. నారాయణ స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన టి. కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి,మండల కార్యదర్శి జి. రఘునాథ్ లు హాజరై ప్రసంగించారు.బీరంగి గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు పెద్ద పెద్ద భూస్వాముల కబంధ హస్తాలలో పెట్టుకొని అనుభవించుకుంటూ ఉన్నారని, వారి చెర నుంచి సదరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచాలని అన్నారు. గ్రామంలో సొంత ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారని వారందరికీ మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి పక్కా గృహ నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని, అలాగే గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు,వికలాంగ,ఒంటరి మహిళ,డప్పు కళాకారులు తదితర పింఛన్లను పంపిణీ చేయడం లేదని,వెంటనే వీరందరికీ నూతన పింఛన్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2026 సంవత్సరం జనవరి 4వ తేదీన బీరంగి గ్రామంలో సోంపురాళ్ల మిట్ట వద్ద భూ పోరాట సదస్సు జరుగుతుందని, ఈ యొక్క సదస్సుకు సిపిఐ రాష్ట్ర పార్టీ నాయకులు,వ్యవసాయ కార్మిక సంఘం,రైతుసంఘం రాష్ట్ర నాయకులు,జిల్లా పార్టీ నాయకులందరూ కూడా హాజరవుతున్నారని,ఈ యొక్క సదస్సులో పేదలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి.లక్ష్మన్న,జి. శంకర,ప్రసాదు,గంగన్న, వెంకటరమణ,వెంకటేష్, నాగరాజు, వెంకటేష్, మంజుల, మమత, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :