Wednesday, 29 July 2026 02:28:04 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

Date : 16 December 2025 07:29 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 16 : రామసముద్రం మండలం దిన్నెపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను రామసముద్రం మండలం సబ్‌ ఇన్‌స్పెక్టర్ పి. దిలీప్ కుమార్ మరియు రాయచోటి శక్తి టీం నుండి పోలీస్ కానిస్టేబుల్ మణికంఠ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులకు మహిళలపై నేరాలు (Crime Against Women), సైబర్ క్రైమ్‌పై జాగ్రత్తలు, రోడ్డు భద్రత (Road Safety Awareness), బాల్య వివాహాల నివారణ, మంచి అలవాట్లు అలవర్చుకోవడం, అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో బాలికలు ఎదుర్కొనే సమస్యలను వివరించి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, హెల్ప్‌లైన్ నంబర్లు ఉపయోగించాలని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల జాగ్రత్తలు పాటించాలని, తప్పుడు సమాచారం, మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు సుమారు 250 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ మరియు బోధన సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో భద్రతపై అవగాహన పెంచడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాఠశాల యాజమాన్యం అభిప్రాయపడింది.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :