నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర వాలీబాల్ జట్టుకు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఎంపిక క్రీడా ప్రతిభకు మరో ఘనత – సి. హేమంత్ కుమార్ను అభినందించిన కళాశాల యాజమాన్యం మదనపల్లె: విశ్వం ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్), మదనపల్లెకు చెందిన విద్యార్థి సి. హేమంత్ కుమార్, బి.టెక్ తృతీయ సంవత్సరం ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) విభాగంలో చదువుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలీబాల్ జట్టుకు ఎంపికై కళాశాలకు ఘనతను తీసుకువచ్చారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ జట్టుకు హేమంత్ కుమార్ ఎంపిక కావడం పట్ల విశ్వం ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థిని అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా కళాశాల యాజమాన్యం నిరంతరం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణ రెడ్డి మాట్లాడుతూ, హేమంత్ కుమార్ రాష్ట్ర వాలీబాల్ జట్టుకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. కఠోర సాధన, పట్టుదల, క్రమశిక్షణతో హేమంత్ ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాలలోని అన్ని అన్ని విభాగాల డీన్స్ మరియు అన్ని విభాగాల అధిపతులు (HODs), అధ్యాపకులు మరియు విద్యార్థులు, హేమంత్ కుమార్ను ఘనంగా అభినందించారు. రాష్ట్ర జట్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు, తల్లిదండ్రులకు మరియు జిల్లాకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. క్రీడా రంగంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ విశ్వం ఇంజినీరింగ్ కళాశాల ముందుకు సాగుతోంది. హేమంత్ కుమార్ సాధించిన ఈ విజయం కళాశాలలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కళాశాల యాజమాన్యం పేర్కొంది. “విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభకు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల ప్రోత్సాహం”
Reporter
Namitha News