నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం -నవంబర్ 08 : రామసముద్రం మండలం పెద్దకురప్పల్లి గ్రామ పంచాయతీ, మట్లవారిపల్లి జడ్పీ హైస్కూల్ లో శనివారం ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రయాణంలో ప్రతీ ఒక్కరూ హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, ట్రాఫిక్ సంకేతాలు, జెబ్రా క్రాసింగ్, స్కూల్ బస్సుల వద్ద రద్దీగా నిలబడకూడదని అత్యవసర పరిస్థితులలో 100/112 కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ నాయుడు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News