నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు బోధిసత్వ బాబాసాహెబ్ అంబేడ్కర్ చూపిన శీలవంతమైన మార్గంలో యువత నడవాలని, భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) యువజన విభాగం నేతలు పిలుపునిచ్చారు. "యువత - నైతికత" అన్న అంశంపై ఆదివారం ప్రెస్ క్లబ్ లో, బాస్ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్బంగా జరిగిన విలేకర్ల సమావేశంలో బాస్ యువజన విభాగం నాయకులు బైనేని సురేష్, నీరుగట్టి రాజేష్, పి. పృద్విరాజ్, చాట్ల కళ్యాణ్, ఆర్. మహేంద్ర, కె. తేజ, ఎస్. ఈశ్వర్ లు మాట్లాడుతూ యువతను సరైన మార్గంలో నడిపించే స్పష్టమైన కార్యక్రమం ఏదీ ప్రభుత్వం వద్ద లేకపోవడం వల్ల, యువత పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత నైతికతతో పునీతమైతే దేశం ఘననీయమైన పురోగతిని సాధిస్తుందని అభిప్రాయ పడ్డారు. యువతలో నైతికతను పెంపొందించడానికి వారికి అంబేడ్కర్ ను బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత అంబేడ్కర్ మార్గంలో నడిపిస్తే, దేశంలో గొప్ప ఆవిష్కరణలు జరుగుతాయని చెప్పారు. యువతను చైతన్య పరిచి, అంబేడ్కర్ మార్గంలో నడిపించడానికి, బాస్ యువజన విభాగం కృషి చేస్తుందని తెలిపారు. బాస్ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంబేడ్కర్ జయంతి ముందస్తు వేడుకలు విజయవంతం చేసిన బాస్ కుటుంబ సభ్యులకు, అంబేడ్కర్ అభిమానులకు వీరు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి పోతబోలు రెడ్డెప్ప, బాస్ వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్, ఉద్యోగ సంఘ నాయకులు చిట్టిబాబు, చిన్నప్పలతో పాటు బాస్ నాయకులు నీరుగట్టి రమణ, గంపల రమణ, సొన్నికంటి రెడ్డెప్ప, డేగాని రమణ, వై. గంగాధర్, బురుజు రెడ్డిప్రసాద్, కృష్ణ, జనార్దన్, శశిధర్, ప్రశాంత్, తరుణ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News