Monday, 14 September 2026 10:59:01 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

.మదనపల్లి జిల్లాగా ప్రకటించబోతునదుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు . .ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Date : 03 December 2025 03:06 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : .మదనపల్లి జిల్లాగా ప్రకటించబోతునదుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు . .ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. .G.o. no. 107,108,ppp విధానాన్ని రద్దు చేయాలి . .మదనపల్లి B.T కళాశాలను బీసెంట్యూనివర్సిటీగా ప్రకటించాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఎస్టియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, దీనిపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) గా వ్యతిరేకత వ్యక్తం చేశారు అన్నమయ్య జిల్లా AISF ప్రధాన కార్యదర్శి మాధవ్ గారు మాట్లాడుతూ— మదనపల్లి జిల్లాగా ప్రకటించబోతున్నందుకు కూటమి ప్రభుత్వానికి మరియు nda కూటమిని స్థానిక MLA గారికి అభినందనలు తెలిపారు. ఎన్నికల ముందు మదనపల్లి జిల్లాపై చంద్రబాబు గారు, లోకేశ్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారని, తాజాగా ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి జిల్లా ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం ప్రశంసనీయమని అన్నారు. అయితే, ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన ఇతర కీలక హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 6400 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని. ముఖ్యంగా, G.O. No. 107, 108లను రద్దు చేయాలి, PPP విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. మదనపల్లి B.T. కళాశాలకు యూనివర్సిటీ స్థాయి కల్పించి, దీన్ని బీసెంట్ యూనివర్సిటీగా ప్రకటించాల్సిన అవసరాన్ని ఆయన గట్టిగా ప్రస్తావించారు. ఇది మదనపల్లి ప్రాంత విద్యా అభివృద్ధికి అత్యంత కీలకమని తెలిపారు. అలాగే, ముందు ఏ విధంగా ఐతే బిటి కళాశాలను ప్రభుత్వ పరం చేసుకున్నామో అదే విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ పరం చేసుకుంటాం అని హెచ్చరించారు .కాబట్టి Government Medical College‌ను PPP విధానంలోకి తీసుకురావడాన్ని AISF తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మాధవ్ గారు స్పష్టం చేశారు. విద్య–ఆరోగ్య రంగాలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు ప్రజల హక్కులను దెబ్బతీస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో, స్థానిక గౌరవ NDA కూటమి గారిని హెచ్చరిస్తున్నం అని తెలిపారు . ప్రజల సమస్యలు, విద్యార్థుల హక్కులు, ఎన్నికల హామీల విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేస్తే AISF ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడదామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గర్ల్స్ కన్వీనర్ కో కన్వీనర్ భవిత,నవ్యశ్రీ మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి సాయికిరణ్, మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు తరుణ్, రావత్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :