నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడిగా బాలు నియామకం - శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు మదనపల్లె : మదనపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అధ్యక్షుడిగా బాలు నియమితులయ్యారు.మదనపల్లె శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా ఆదేశాలు,ఆశీస్సులతో తనను ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు బాలు తెలిపారు.ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం తాను చేసిన సేవలను గుర్తించి,తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్,రాజంపేట పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షులు కౌశిక్ రెడ్డి,టిడిపి యువనేత జునైద్ అక్బరీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.ఐటీడీపీ అధ్యక్షుడిగా తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని బాలు స్పష్టం చేశారు.పార్టీ విధానాలు,ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.నాయకులు,కార్యకర్తలు తనకు సహకరంతో నియోజకవర్గంలో ఐ.టి.డి.పి విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.కాగా నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులుగా ఎంపికైన బాలుకు ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా,యువనాయకుడు జూలై అక్బరి పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.
Reporter
Namitha News