నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మే 09 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తంబళ్లపల్లె ఇన్చార్జి పోతుల సాయినాథ్ కు రాష్ట్ర డీలిమిటేషన్ కమిటీ సభ్యులు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అనంతపురం అర్బన్ ఇన్చార్జి టి.సి వరుణ్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర హస్తకళ అభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ లు సూచించారు. శనివారం తిరుపతి లో డి లిమిటేషన్ కమిటీ సభ్యులను తంబళ్లపల్లె ఇంచార్జ్ సాయినాథ్, ఎం ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఎద్దుల నరసింహులు ఘనంగా సన్మానించి తంబళ్లపల్లె నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు,సమస్యలను కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తో సమన్వయపరచుకొని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీకి దక్కాల్సిన ప్రాధాన్యత, పొత్తులో పార్టీ సముచిత స్థానం తో పాటు జనసైనికుల ఆకాంక్షలు, ప్రజల ఆదరాభిమానాలు పొందేలా కృషి చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సహకారంతో జనసైనికులు విజయ బావుటా ఎగరవేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సత్ఫలితాలు సాధించాలని ఉత్తేజపరిచారు. వారి వెంట తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల పార్టీ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News