నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా టిటిడి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనాలపై మాడవీధుల్లో విహరించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం ధూప దీప నైవేద్యాలతో పలు రకాల పుష్పాలతో అలంకరించి సూర్యప్రభ వాహనం పై మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనల నడుమ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను టిటిడి ప్రధాన అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి, టిటిడి అధికారులు కృష్ణమూర్తి, నగేష్, మురళి, వందలాదిమంది భక్తులు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News