నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఏప్రిల్ 01: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు ఏర్పాటుతో వారి కుటుంబాలకు ఓ వరమని బిజెపి సీనియర్ నాయకుడు మగ్గాలు లక్ష్మయ్య కొనియాడారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏవో థామస్ రాజా, జౌళిశాఖ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకట్ కుమార్ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు అమలవుతుందన్నారు. చేతిమగ్గం వేసే చేనేత కార్మికులకు 200 యూనిట్లు విద్యుత్తు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు విద్యుత్తు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. అర్హులైన చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంబంధిత దరఖాస్తు లను తమ పరిధిలోని విద్యుత్ శాఖ ఎఈ కార్యాలయంలో ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున, టిడిపి నేతలు కోటకొండ రెడ్డప్ప, నిజాముద్దీన్,రాజేష్, మణి, చేనేత కార్మికులు,కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News