నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 25 : రామసముద్రం మండలం ఆర్. నడింపల్లి గ్రామంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి విగ్రహ పునః ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు హోమాలు నిర్వహించి, వేదమంత్రాల నడుమ అభిషేకాలు, ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం గ్రామంలోని ప్రజలు సుఖశాంతులతో జీవించాలని గ్రామంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Reporter
Namitha News