నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై4 : ఈనెల 7వ తేదీన ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి మాదిగ పల్లెలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగరాలని తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్ లు తెలిపారు. పరుసతోపు పంచాయతీ అంబేద్కర్ కాలనీలో వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా అణగారిన మాదిగ జాతికి ఎమ్మార్పీఎస్ ఉద్యమం ద్వారా రిజర్వేషన్ సాధించుకున్నామని ఆ ఘన కీర్తికి కారణ జన్ముడైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిగ బిడ్డల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సైతం ఘనంగా చరిత్రలో నిలిచిపోయేలా జరగడానికి మాదిగ బిడ్డలు కలిసి రావాలన్నారు. జూలై 7వ తేదీ ఉదయం ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి అనంతరం తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమానికి ప్రతి మాదిగ తరలి రావాలని సూచించారు
Reporter
Namitha News