నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 13 : భారతదేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి నాడు నేటికీ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని జాతీయ బిజెపి కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి కొనియాడారు. ఆదివారం ఆయన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ చల్లపల్లి నరసింహారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు పులి నరేందర్ రెడ్డి,రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి పీట్ల అంజలి రాజనాల తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ దేశం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అభివృద్ధిలో వికసిద్భారత్, 2047 విజన్ వైపు పరుగులు పెడుతోందని కొనియాడారు. నేడు దేశం ప్రపంచంలోనే అన్ని రంగాలలో రాణించి ప్రత్యేక గుర్తింపు సాధించడం మోతి ఘనతనని ప్రశంసించారు. భవిష్యత్తులో సైతం ఎన్ డి ఏ సారథ్యంలో మరోమారు బిజెపి సారథంలోని ఎన్ డి ఏ ఘనవిజయం తప్పదని అవినీతి కాంగ్రెస్కు అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని నేడు రాష్ట్రానికి బిజెపి దశ దిశగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముకల నిలిచినట్లు చెప్పారు
Reporter
Namitha News