నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 12 : తంబళ్లపల్లె మండలం ఎర్రసానిపల్లి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి అనారోగ్యం తో సోమవారం మృతి చెందారు. ఆయన ఎల్ఐసి ఏజెంట్ గా ఎర్రసానిపల్లి పంచాయతీ సర్పంచిగా ప్రజల మన్ననలు పొందాడు. బిజెపి లో కీలక నాయకుడుగా టిడిపి మండల అధ్యక్షుడుగా అనంతరం వైకాపా నాయకుడిగా కీలక పదవులతో ప్రజాసేవ చేశాడు. ఆయన మృతి కి మాజీ ఎంపీపీ నాంది రెడ్డప్ప, పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వెంకట్ రెడ్డి మృతి పై సంతాపం ప్రకటించారు.
Reporter
Namitha News