Wednesday, 29 July 2026 04:26:43 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

సత్ సంగ్ ఫౌండేషన్ సహకారం తో మైభూమి క్లీన్అప్ డ్రైవ్ నిర్వహించిన మిట్స్ విద్యార్థులు

Date : 04 May 2026 07:15 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 04 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని యన్.ఎస్.ఎస్. మరియు యన్.సి.సి విద్యార్థులు మదనపల్లె లోని సత్సంగ్ ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహించిన “మైభూమి క్లీన్-అప్ డ్రైవ్ మరియు కమ్యూనిటీ అవగాహన కార్యక్రమం” విజయవంతంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు, అధ్యాపకులు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక బాధ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రదేశాలు, కాలనీలు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి, చెత్తను తొలగించారు. అదనంగా, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను వర్గీకరించడం, పరిశుభ్రమైన జీవనశైలిని పాటించడం మరియు పర్యావరణాన్ని కాపాడడం వంటి అంశాలపై ర్యాలీలు మరియు పోస్టర్ ప్రచారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యెన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మాట్లాడుతూ యువత సమాజ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాలని, “స్వచ్ఛమైన భూమి – ఆరోగ్యకరమైన సమాజం” లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. అలాగే సత్సంగ్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్. ఆదర్శ్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల్లో విద్యార్థుల చురుకైన పాల్గొనడాన్ని అభినందించి, భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక సేవ పట్ల అవగాహన మరింత పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న యెన్ ఎస్ ఎస్ మరియు యన్.సి.సి. విద్యార్థులను వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ మరియు అధ్యాపకులు అభినందించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :