నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు - టిడిపి నాయకులు ఎస్.ఏ మస్తాన్,నాగూర్ వలి ప్రశంసలు మదనపల్లె : కూటమి ప్రభుత్వ పాలనలో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.ఏ.మస్తాన్,ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా)లు స్పష్టం చేశారు.మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని 13,14 వార్డుల పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు.ఇందులో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల,అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం పరిపాలనలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు.ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు,తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ,ఎన్టీఆర్ గృహకల్ప,స్త్రీ శక్తి,అన్న క్యాంటీన్లు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.అదేవిధంగా ప్రజా రాజధాని అమరావతి,ఆంధ్రుల జీవనాడి పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం,రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసిందని ప్రశంసించారు.దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు త్వరలో జరుగబోవు స్థానిక సంస్థలు,మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తఇండ్లు దొరస్వామి నాయుడు,టిడిపి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Namitha News