Thursday, 30 July 2026 08:57:34 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు

టిడిపి నాయకులు ఎస్.ఏ మస్తాన్,నాగూర్ వలి ప్రశంసలు

Date : 30 July 2026 05:09 PM Views : 6

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు - టిడిపి నాయకులు ఎస్.ఏ మస్తాన్,నాగూర్ వలి ప్రశంసలు మదనపల్లె : కూటమి ప్రభుత్వ పాలనలో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.ఏ.మస్తాన్,ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా)లు స్పష్టం చేశారు.మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని 13,14 వార్డుల పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు.ఇందులో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల,అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం పరిపాలనలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు.ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు,తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ,ఎన్టీఆర్ గృహకల్ప,స్త్రీ శక్తి,అన్న క్యాంటీన్లు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.అదేవిధంగా ప్రజా రాజధాని అమరావతి,ఆంధ్రుల జీవనాడి పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం,రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసిందని ప్రశంసించారు.దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు త్వరలో జరుగబోవు స్థానిక సంస్థలు,మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తఇండ్లు దొరస్వామి నాయుడు,టిడిపి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :