నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబరు 26 : మన సంస్కృతి సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో మన సంస్కృతి మన సంక్రాంతి పేరిట గుర్రంకొండ కొత్తపేట లో ఉన్న ఎబిసి ఒలంపియాడ్ స్కూల్ లో ముందొస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు, భోగి మంటలు, గాలి పటాల పోటీలు, సాంప్రదాయ జానపద పాటలు, నృత్యాలు తదితర కార్యక్రమాల తో ఎబిసి విద్యార్ధులు, కళాకారులు అలరించారు. మన సంస్కృతి సంస్థ కార్యదర్శి రెడ్డెప్ప, విశ్వహిందూ పరిషత్ ధర్మాచార్య శంకర, మహేంద్ర మర్రి పీఠాధిపతి మల్లికార్జున స్వామి, రిటైర్డ్ దూరదర్శన్ చీఫ్ కెమరామెన్ ప్రభాకర మూర్తి, నక్కా రాచయ్య ట్రస్ట్ కార్యదర్శి నక్కా సతీష్ , నక్కా బాలాజీ, బిజెపి జిల్లా సభ్యులు గోపాల్ రెడ్డి, తదితరులు సంక్రాంతి విశిష్టత, ఎబిసి స్కూల్ లో కార్యక్రమాల గురించి ప్రసంగించారు. కళాకారులు ఉప్పు శ్రీనివాసులు, రామలక్ష్మి, అమర, రామాంజులు, వెంకటరమణ, తదితరులు వాద్య గానాలతో అలరించారు. అతిథులు భోగి మంట వద్ద పూజలు నిర్వహించి మంట వెలిగించారు. గాయకుడు, రచయిత తిరువీధి శ్రీధర్ ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్ శేషాధ్రి నాయుడు సంయుక్త ఆధ్వర్యాన కార్యక్రమాల నిర్వహణ పట్ల పలువురు ప్రశంసించారు. విచ్చేసిన అతిథులను శాలువాలతో సత్కరించిన అనంతరం అందరికీ భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పరసా అమర, అనిల్, రమేష్ , టైలర్ శీనా, నవీన్, మాకం వెంకటేశ్వర్లు, రెడ్డెప్ప, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎబిసి హెడ్ అంభిలీ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News