Monday, 08 June 2026 09:57:14 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

ఏబిసి ఓలింపియాడ్ స్కూల్ లో ముందోస్తు సంక్రాంతి సంబరాలు

Date : 26 December 2025 08:06 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబరు 26 : మన సంస్కృతి సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో మన సంస్కృతి మన సంక్రాంతి పేరిట గుర్రంకొండ కొత్తపేట లో ఉన్న ఎబిసి ఒలంపియాడ్ స్కూల్ లో ముందొస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు, భోగి మంటలు, గాలి పటాల పోటీలు, సాంప్రదాయ జానపద పాటలు, నృత్యాలు తదితర కార్యక్రమాల తో ఎబిసి విద్యార్ధులు, కళాకారులు అలరించారు. మన సంస్కృతి సంస్థ కార్యదర్శి రెడ్డెప్ప, విశ్వహిందూ పరిషత్ ధర్మాచార్య శంకర, మహేంద్ర మర్రి పీఠాధిపతి మల్లికార్జున స్వామి, రిటైర్డ్ దూరదర్శన్ చీఫ్ కెమరామెన్ ప్రభాకర మూర్తి, నక్కా రాచయ్య ట్రస్ట్ కార్యదర్శి నక్కా సతీష్ , నక్కా బాలాజీ, బిజెపి జిల్లా సభ్యులు గోపాల్ రెడ్డి, తదితరులు సంక్రాంతి విశిష్టత, ఎబిసి స్కూల్ లో కార్యక్రమాల గురించి ప్రసంగించారు. కళాకారులు ఉప్పు శ్రీనివాసులు, రామలక్ష్మి, అమర, రామాంజులు, వెంకటరమణ, తదితరులు వాద్య గానాలతో అలరించారు. అతిథులు భోగి మంట వద్ద పూజలు నిర్వహించి మంట వెలిగించారు. గాయకుడు, రచయిత తిరువీధి శ్రీధర్ ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్ శేషాధ్రి నాయుడు సంయుక్త ఆధ్వర్యాన కార్యక్రమాల నిర్వహణ పట్ల పలువురు ప్రశంసించారు. విచ్చేసిన అతిథులను శాలువాలతో సత్కరించిన అనంతరం అందరికీ భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పరసా అమర, అనిల్, రమేష్ , టైలర్ శీనా, నవీన్, మాకం వెంకటేశ్వర్లు, రెడ్డెప్ప, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎబిసి హెడ్ అంభిలీ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :