Sunday, 13 September 2026 09:57:28 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మదనపల్లి లో ఘనంగా ముగిసిన ఇషా గ్రామోత్సవాలు

Date : 19 July 2026 03:25 PM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 19 : అన్నమయ్య జిల్లా లోని మదనపల్లి సమీపంలోని ప్రకృతివనం లో నిర్వహించిన ఇషా గ్రామోత్సవాలు ఘనంగా ముగిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, మహిళల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామోత్సవాల రెండవ రోజు గ్రామీణ మహిళల కోసం త్రో బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 12 గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు . క్రీడాస్ఫూర్తితో జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ రాధిక, విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నిషిత చేతు , ప్రకృతి వనం వ్యవస్థాపకురాలు శ్రీమతి యోగితా ప్రసాద్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ఇషా గ్రామోత్సవాలు గ్రామీణ మహిళల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రీడాస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోటీల్లో విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, పాల్గొన్న ప్రతి మహిళ విజేతేనని అతిథులు కొనియాడారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన నిర్వాహకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు

ఈ గ్రామోత్సవాలు గ్రామీణ మహిళల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, గ్రామాల మధ్య స్నేహభావం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమం లో ఇషా ప్రతినిధులు డాక్టర్ జి అజ్మతుల్లా ఖాన్, ఐశ్వర్య, కిషోర్, అశోక్, హర్షిత, దామోదర్ పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :