నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 13 : మదనపల్లి మండలం చీకులభైలు గ్రామానికి చెందిన జోలపేట వెంకటమ్మ చెరువు చైర్మన్ శివ గారి కుమార్తె లహరి, ప్రసాద్ ల నిశ్చితార్థ వేడుకలను రామారావు కాలనీ లోని శ్రీరస్తు కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా నిశ్చితార్థ వేడుకలకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయు ఆరారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చీకులభైలు సర్పంచ్ ప్రభాకర్, శివ, మాజీ ఎంపీటీసీ రాజన్న, శ్రీకాంత్ రెడ్డి, బండి రాజ్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు నరసింహులు, జిల్లెల లక్ష్మన్న, ఉల్లి కృష్ణవేణి మరియు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు శ్రీరామ్ చినబాబును సాదరంగా ఆహ్వానించి ఆ వేడుకలను తిలకించారు
Reporter
Namitha News