Saturday, 12 September 2026 01:53:12 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

సమస్యలు పరిష్కరించే వరకు పోరు బాటే!

- కలెక్టరేట్,సబ్‌ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల భోజన విరామ నిరసన - డీఆర్వోకు ఉద్యోగుల వినతిపత్రం..

Date : 03 September 2026 04:53 PM Views : 61

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సమస్యలు పరిష్కరించే వరకు పోరు బాటే! - కలెక్టరేట్,సబ్‌ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల భోజన విరామ నిరసన - డీఆర్వోకు ఉద్యోగుల వినతిపత్రం.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరుబాట తప్పదని, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎం.బాబ్జి అన్నారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు రెవెన్యూ ఉద్యోగులు గురువారం జిల్లా కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఉద్యోగులతో కలసి,డీఆర్వో వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించి, మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ డీఏ బకాయిలతో పాటు పీఆర్సీ, జీపీఎఫ్‌, సరెండర్‌ లీవ్‌ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ నాటి నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఆరేళ్ల సర్వీస్‌ స్పెషల్‌ గ్రేడ్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పాలసీ అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడంతో పాటు ఎంప్లాయీస్‌ హెల్త్‌ కార్డ్స్‌ (ఈహెచ్‌ఎస్‌)ను సమగ్రంగా వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే జేఏసీ కార్యాచరణ మేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఫోటోలు ఉన్నాయి

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :