నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 ః తెలుగు రాష్ట్రాలలో బలమైన శక్తిగా ఎదిగిన కురుబ కులాన్ని సౌత్ ఇండియా లో బలోపేతానికి కురుబ సంఘ నాయకుల సహకారంతో కృషి చేస్తామని తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, థీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన కురుబ, కురుమ సంఘ నాయకుల సమావేశంలో ఆయన తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాల లో కురుబ, కురుమ సంఘ నాయకులు చేసిన కృషిని పేరుపేరునా తన గళం వినిపించి కొనియాడారు. కురుబ సంఘం బలోపేతం తోపాటు సమస్యల పరిష్కారం, కురుబల విద్య, ఉద్యోగం, జీవనోపాధి తదితర సమస్యల పరిష్కారం కోసం దశాబ్ద కాలంగా అలుపెరగని నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కురుబల సంక్షేమం కోసం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వాలు ఏవైనా రాజకీయంగా కురుబల సంఖ్యా బలాన్ని బట్టి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు సాధించడంతోపాటు మంత్రి పదవులు పొందడంలో కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. భవిష్యత్తులో సౌత్ ఇండియాలో కురబల ప్రాచుర్యం పెంచి వారి సమస్యల పరిష్కారం, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి సమిష్టి కృషి చేస్తామని హామీ ఇచ్చారు
Reporter
Namitha News