నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 17 : తంబళ్లపల్లి మండలం లో జరిగిన ఉపాధి హామీ కరువు పనుల నిర్వహణపై జరిగే సామాజిక సర్వేకు ఉపాధి హామీ సిబ్బంది సమాయత్తం కావాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ సూచించారు. సోమవారం ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్,ఏపీవో అంజన్న, ఈసీ మహేష్, సామాజిక సర్వే డిఆర్పీలు అనిల్, శ్రీనివాస్ నాయక్ లతో ఆయన సమీక్షించారు. ఈనెల 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు మండలంలోని 21 పంచాయతీలలో జరిగిన ఉపాధి హామీ కరువు పనుల తనిఖీలు నిష్పక్షపాతంగా నిర్వహించి అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో బహిరంగ గ్రామసభ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సామాజిక సర్వే బృందానికి ఉపాధి హామీ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు, పనిచేసిన కూలీలు సహకరించాలని ఆయన సూచించారు.
Reporter
Namitha News