Friday, 19 June 2026 03:22:33 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

సాగు విస్తీర్ణం, పాల ఉత్పత్తి పెంపుపై కలెక్టర్ నిశాంత్ కుమార్ దిశానిర్దేశం

యుద్ధ ప్రాతిపదికన జలధార పనులను పూర్తి చేయాలి

Date : 01 May 2026 07:50 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 01 : జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 4,938 పనులను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత కాలపరిమితిలోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని, అందుకు సంబంధిత అధికారులు బాధ్యతతో కృషి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో మండల వారీగా కాస్కేడ్స్ నింపేందుకు చేపట్టిన చర్యలు, అందుబాటులో ఉన్న నీటి పరిమాణం, పనులు పూర్తయ్యాక నీటి లభ్యతపై సంబంధిత అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జలధార పనుల ఫలితంగా చెరువుల్లో నీటి నిల్వ పెరుగుతుందని, దీనిని ఉపయోగించుకొని ఆర్‌ఎస్‌కే వారీగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. రైతులకు పంటల సాగు, డ్రిప్ ఇరిగేషన్, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించి ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాన్సూన్ అనంతరం పాల ఉత్పత్తి పెంపునకు పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని, శాఖల సమన్వయంతో రైతులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఉన్న 3,700 చెరువులు, 332 ఆర్‌ఎస్‌కే కేంద్రాల ఆధారంగా సాగు విస్తీర్ణం పెంపుపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెరువుల పరిధిలోని బోర్లు, రీఛార్జ్ పరిస్థితి, అదనంగా సాగు చేయగల విస్తీర్ణం, పంటల ఎంపిక వంటి అంశాలపై సూక్ష్మస్థాయి కార్యాచరణ రూపొందించి రైతులకు వివరించాలని సూచించారు. గత ఖరీఫ్, రబీ సీజన్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు సాగు లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి చెరువు పరిధిలో కనీసం 20 మంది పాడి రైతులను ప్రోత్సహించి, క్రాస్‌బ్రీడ్ ఆవులు, ఎద్దులు పెంపుతో పాల ఉత్పత్తి పెంచాలని సూచించారు. అదనంగా సుమారు 10,000 పశువులు పెంచితే రోజుకు లక్ష లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయని, రైతులకు రోజుకు సుమారు ₹60 లక్షల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అటవీ శాఖ పరిధిలో చేపట్టాల్సిన జలధార పనులకు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని, సంబంధిత అధికారులతో సమన్వయం పెంచాలని ఆదేశించారు. జలధార పనులకు సహకరిస్తున్న దాతలను మండల స్థాయి సమావేశాలకు ఆహ్వానించి గౌరవించాలని, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో వారిని సన్మానిస్తామని తెలిపారు. అనంతరం నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరాలు సమర్పించగా, వాటిపై కలెక్టర్ సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవోలు, డ్వామా పీడీ, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: