Sunday, 03 May 2026 09:17:04 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

సాగు విస్తీర్ణం, పాల ఉత్పత్తి పెంపుపై కలెక్టర్ నిశాంత్ కుమార్ దిశానిర్దేశం

యుద్ధ ప్రాతిపదికన జలధార పనులను పూర్తి చేయాలి

Date : 01 May 2026 07:50 PM Views : 35

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 01 : జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 4,938 పనులను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత కాలపరిమితిలోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని, అందుకు సంబంధిత అధికారులు బాధ్యతతో కృషి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో మండల వారీగా కాస్కేడ్స్ నింపేందుకు చేపట్టిన చర్యలు, అందుబాటులో ఉన్న నీటి పరిమాణం, పనులు పూర్తయ్యాక నీటి లభ్యతపై సంబంధిత అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జలధార పనుల ఫలితంగా చెరువుల్లో నీటి నిల్వ పెరుగుతుందని, దీనిని ఉపయోగించుకొని ఆర్‌ఎస్‌కే వారీగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. రైతులకు పంటల సాగు, డ్రిప్ ఇరిగేషన్, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించి ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాన్సూన్ అనంతరం పాల ఉత్పత్తి పెంపునకు పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని, శాఖల సమన్వయంతో రైతులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఉన్న 3,700 చెరువులు, 332 ఆర్‌ఎస్‌కే కేంద్రాల ఆధారంగా సాగు విస్తీర్ణం పెంపుపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెరువుల పరిధిలోని బోర్లు, రీఛార్జ్ పరిస్థితి, అదనంగా సాగు చేయగల విస్తీర్ణం, పంటల ఎంపిక వంటి అంశాలపై సూక్ష్మస్థాయి కార్యాచరణ రూపొందించి రైతులకు వివరించాలని సూచించారు. గత ఖరీఫ్, రబీ సీజన్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు సాగు లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి చెరువు పరిధిలో కనీసం 20 మంది పాడి రైతులను ప్రోత్సహించి, క్రాస్‌బ్రీడ్ ఆవులు, ఎద్దులు పెంపుతో పాల ఉత్పత్తి పెంచాలని సూచించారు. అదనంగా సుమారు 10,000 పశువులు పెంచితే రోజుకు లక్ష లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయని, రైతులకు రోజుకు సుమారు ₹60 లక్షల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అటవీ శాఖ పరిధిలో చేపట్టాల్సిన జలధార పనులకు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని, సంబంధిత అధికారులతో సమన్వయం పెంచాలని ఆదేశించారు. జలధార పనులకు సహకరిస్తున్న దాతలను మండల స్థాయి సమావేశాలకు ఆహ్వానించి గౌరవించాలని, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో వారిని సన్మానిస్తామని తెలిపారు. అనంతరం నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరాలు సమర్పించగా, వాటిపై కలెక్టర్ సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవోలు, డ్వామా పీడీ, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: