Tuesday, 15 September 2026 07:53:17 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు

Date : 01 March 2026 07:45 PM Views : 317

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 01 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభను విద్యా పర్యటనలో భాగంగా సందర్శించి, రాష్ట్ర బడ్జెట్ సమీక్ష సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం పొందారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ సందర్శన విద్యార్థులకు శాసనసభలో జరిగే ప్రత్యక్ష చర్చలు, ప్రజా సమస్యలపై సభ్యులు వ్యక్తపరిచే అభిప్రాయాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై జరిగే విశ్లేషణలు మరియు ప్రజా సంక్షేమ పథకాల అమలుపై తీసుకునే నిర్ణయాల ప్రక్రియలను సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. బడ్జెట్ సమావేశంలో ఆదాయం-వ్యయం లెక్కలు, అభివృద్ధి కార్యక్రమాల కేటాయింపులు, వివిధ రంగాలకు సంబంధించిన ప్రణాళికలు వంటి అంశాలు ఎలా చర్చించబడతాయో విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవనీయులైన స్పీకర్ సి. అయ్యన్న పాత్రుడు ను విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలుసుకుని పరస్పర సంభాషణ జరిపే అవకాశం పొందారని అన్నారు. ఆయన శాసన వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలు, ప్రజా ప్రతినిధుల బాధ్యతలు మరియు యువత సమాజ నిర్మాణంలో పోషించాల్సిన కీలక పాత్ర గురించి స్పష్టమైన మరియు ప్రేరణాత్మక సందేశాన్ని అందించి, మంచి నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు మరియు ప్రజాసేవ భావనతో ముందుకు సాగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిట్స్ అధ్యాపకులు మరియు విద్యార్థులకు మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, డీన్-స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: