నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 21 ః మహిళా సంఘాలు వార్షిక జీవనోపాదుల భవిష్యత్ ప్రణాళికతో అభివృద్ధి బాట పట్టాలని ఏపిఎం గంగాధర్ సూచించారు. మంగళవారం ఐకెపి కార్యాలయంలో మహిళా సంఘ జీవనోపాదుల ప్రణాళిక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ ప్రణాళిక నిర్వహణపై రాష్ట్ర సర్ఫ్ సీఈవో తొలి కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా భవిష్యత్ కార్యాచరణ పై పూర్తిస్థాయిలో మహిళా సంఘాలు అవగాహన పొందారు. మహిళా సంఘాలు రుణాల సద్వినియోగం, విభిన్న వ్యాపారాలు, పరిశ్రమలపై అవగాహన పొందడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచనలు చేశారు. మహిళా సంఘాలు ప్రతి కుటుంబంలో జీవనోపాదుల వార్షిక ప్రణాళిక తో ముందడుగు వేయడానికి వారికి తోచిన విధంగా అభివృద్ధి తమ వంతు సహకారం అందించాలని ఇందుకు తగు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి మేనేజర్ అమరావతి, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, హాయ్ చెప్పి అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, వివో సభ్యులు, ఎమ్మెస్ ఓపి సభ్యులు, పాల్గొన్నారు
Reporter
Namitha News