Monday, 14 September 2026 07:46:31 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

వైద్య కళాశాల లను ప్రవేట్ పరం చేసే జి.ఓ. ప్రతులను భోగి మంటల్లో వేసిన సిపిఐ నాయకులు

పేద,మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు కంకణం కట్టుకున్న కాళకూటమి ప్రభుత్వం - సిపిఐ

Date : 14 January 2026 10:58 AM Views : 262

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - జనవరి 14 : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ (పిపిపి) పేరుతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు కంకణం కట్టుకుని 590,847 జీవోలను తీసుకువచ్చిందని సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. భోగి పండుగను పురస్కరించుకొని బుధవారం ఉదయం ఐదు గంటలకు స్థానిక పిటిఎం రోడ్డు నందు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భోగిమంటలను వేసి అందులో 590,847 జీవో ప్రతులను దగ్ధం చేశారు. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం మానుకోవాలని,తక్షణం ప్రజా వ్యతిరేక జీవోలను రద్దు చేయాలని,పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడం మానుకోవాలని,పిపిపి విధానాన్ని రద్దు చేయాలని,ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నడపాలని,కూటమి ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా యస్.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ; నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు కోసం భూములు,భవనాల నిర్మాణం,వనరులు,మౌళిక సదుపాయాలతో పాటు సిబ్బందికి వేతనాలు కూడా ప్రభుత్వమే చెల్లించి కళాశాలల నిర్వహణను మాత్రం పిపిపి పేరుతో ప్రైవేటుకు అప్పగించడం ఎంతవరకు సబబో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు మొండిగా వ్యవహరించడం చూస్తుంటే ఇది "కూటమి ప్రభుత్వం" కాదని ఇది "కాళకూటమి ప్రభుత్వమని" ఘాటుగా విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఎస్. తంబయ్యశెట్టి,ఎం.అష్రఫ్అల్లీ,పి.మంజునాథ్,జి. నారాయణస్వామి,ఎం. గంగులప్ప,హబీబ్, రామచంద్ర,షఫీ,రెడ్డప్ప, గంగాధర్,కిట్టన్న, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: