నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబరు 28 : తంబళ్లపల్లె మండలం కుక్క రాజు పల్లి అంగన్వాడి పాఠశాలలో ఆదివారం ఉపాధి హామీ గ్రామ సభ జరిగింది. సామాజిక తనిఖీలు భాగంగా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన 22 ఫారం పాండ్స్, గడ్డి పెంపకం, మొక్కల పెంపకం, పలు అభివృద్ధి పనులపై ఏపీఓ అంజనప్ప, ఈసీ రామన్న ఆధ్వర్యంలో డి ఆర్ పి శ్రీనివాస్ నాయక్ ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం గ్రామసభలో రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి జాబ్ కార్డు కలిగిన కూలికి పనులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామరాజు, టి ఏ వెంకటరమణ, క్షేత్ర సహాయకుడు చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News