Wednesday, 29 July 2026 05:55:36 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడ్డుపడడం భావ్యం కాదు - పోతుల సాయినాథ్

Date : 26 December 2025 08:26 PM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 25 : కూటమి ప్రభుత్వంలో మంజూరయిన అభివృద్ధి పనులను అడ్డుకోవడం భావ్యం కాదని తంబళ్లపల్లె జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ కోరారు. శుక్రవారం పంచాలమర్రి లో మంజూరైన మినీ పంచాయతీ భవన నిర్మాణ స్థల వివాదంపై ఆయన ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపారు. భవన నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం ప్రభుత్వందని అందులో నిర్మాణం చేపడుతుంటే కొందరు అడ్డుపడడం పై రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు ఇదివరకే విచారణ చేసి అది ప్రభుత్వ స్థలంగా గుర్తించారు. అయితే కొందరు అక్కడ ఆక్రమణకు పాల్పడిన విషయం తెలుసుకున్న సాయినాథ్ ఇరు వర్గాలతో చర్చించి పంచాయతీ అభివృద్ధి కోసం నిర్మిస్తున్న భవనాన్ని అడ్డుకోరాదని రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారుల సూచన మేరకు నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం తంబళ్లపల్లె ఎస్సై అనిల్ కుమార్ ను సన్మానించి తంబళ్లపల్లె మండలంలో శాంతి భద్రతల పరిరక్షణపై సహకరించాలని సూచించారు.ఆయన వెంట మండల జనసేన రథసారథి ఎద్దుల నరసింహులు, సిద్ధమల్ రెడ్డి,మురళీకృష్ణ, టిడిపి నాయకులు ఆనంద్ రెడ్డి, రాఘవరెడ్డి, రామచంద్ర, బిజెపి నాయకులు రామస్వామి రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :