Sunday, 03 May 2026 08:03:40 PM
# రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # పెన్షన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయండి - ఎంపీడీవో యం వి ప్రసాద్ # తంబళ్లపల్లెలో గాలి వాన బీభత్సానికి మామిడి రైతుల విలవిల # కోసువారిపల్లిలో సీజన్ వన్ భారీ క్రికెట్ టోర్నమెంట్ # తంబళ్లపల్లె లో గాలివాన బీభత్సం # జిల్లా సమగ్రాభివృద్ధికి దృఢ ప్రణాళిక తో లక్ష్యం ను ఆదిగమించాలి - కలెక్టర్ # సాగు విస్తీర్ణం, పాల ఉత్పత్తి పెంపుపై కలెక్టర్ నిశాంత్ కుమార్ దిశానిర్దేశం # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవ రెడ్డి # మదనపల్లి డీఎస్పీ పావని ని సన్మానించిన దళిత నాయకులు

నెరవేరబోతోన్న పుంగనూరు యువత చిరకాల కోరిక

పట్టణంలో క్రీడా మైదానానికి రంగం సిద్ధం - ఇంచార్జి సిరివేలు గంగాధర్ @ చిన్నా రాయల్

Date : 20 April 2026 11:43 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ​పుంగనూరు - ఏప్రిల్ 20 : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న 'జనవాణి' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పుంగనూరు పట్టణ యువత నుంచి వచ్చిన ప్రధాన విన్నపం - పట్టణంలో ఒక అధునాతన క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని. ​యువత కోరికపై తక్షణమే స్పందించిన పుంగనూరు జనసేన ఇంచార్జ్ చిన్న రాయల్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా అసోసియేషన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆయన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర క్రీడల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ క్రికెట్ విజయ్ కుమార్ గారు సోమవారం పుంగనూరులోని శుభారం కళాశాల మైదానాన్ని స్వయంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, మైదానం ఏర్పాటుపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి, పనులకు శ్రీకారం చుడతామని భరోసా ఇచ్చారు. యువతకు మెరుగైన క్రీడా వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు, "యువత కోరికను తీర్చడం నా బాధ్యత, త్వరలోనే పుంగనూరు ఆటగాళ్లకు సొంత మైదానం అందుబాటులోకి వస్తుంది" చిన్న రాయల్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :