నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 20 : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న 'జనవాణి' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పుంగనూరు పట్టణ యువత నుంచి వచ్చిన ప్రధాన విన్నపం - పట్టణంలో ఒక అధునాతన క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని. యువత కోరికపై తక్షణమే స్పందించిన పుంగనూరు జనసేన ఇంచార్జ్ చిన్న రాయల్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా అసోసియేషన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆయన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర క్రీడల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ క్రికెట్ విజయ్ కుమార్ గారు సోమవారం పుంగనూరులోని శుభారం కళాశాల మైదానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, మైదానం ఏర్పాటుపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి, పనులకు శ్రీకారం చుడతామని భరోసా ఇచ్చారు. యువతకు మెరుగైన క్రీడా వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు, "యువత కోరికను తీర్చడం నా బాధ్యత, త్వరలోనే పుంగనూరు ఆటగాళ్లకు సొంత మైదానం అందుబాటులోకి వస్తుంది" చిన్న రాయల్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు
Reporter
Namitha News