నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రిల్ 13 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం పంచాయతీ పరిధిలోని ఎర్రప్పశెట్టిపల్లి గ్రామం లోని సర్వే నంబర్ 6/4 లో 4.11 సెంట్ల భూమిని ప్రస్తుతం ఓ వ్యక్తి ఎస్సీ కాలనీకి చెందిన భూమిని ఆక్రమించుకొని ఉన్నారని ఆదివారం గ్రామస్తులు అక్రమణను అడ్డుకున్నారు. గత కొంతకాలం క్రితం సదరు భూమిని ఎస్సీ కాలనీకి కేటాయిస్తారని ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మండల అధికారులు తెలిపారని అన్నారు. గ్రామస్థులు పలుమార్లు ఆక్రమణకు గురైన విషయాన్ని అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు
Reporter
Namitha News