నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 15 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అల్యూమిని రిలేషన్స్ సెల్ మరియు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట ఇంటరాక్షన్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అవకాశాలు కల్పించే దిశగా అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన కోడ్ 2 ఏ.ఐ కెరీర్ సంస్థ సీఈఓ మరియు యూనివర్సిటీ ఈ సి ఈ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు అయిన నిషా రెడ్డి, ఎస్పీఓసీ జయశ్రీ.డి లు మరియు విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గౌర్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IIoT) మరియు ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. నూతన సాంకేతికతలు కమ్యూనికేషన్ సిస్టమ్స్, స్మార్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆటోమేషన్ మరియు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IIoT) వంటి రంగాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, విద్యార్థులు ఈ రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు మిట్స్ యూనివర్సిటీ శిక్షణ మరియు ఇంటర్న్షిప్ అవకాశాలను అందిచేందుకు కృషిచేస్తున్నదని అన్నారు. దీని ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో సాంకేతిక రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలరని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ నాగ శ్వేతా, డాక్టర్ రాజశేఖరన్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు
Reporter
Namitha News