Saturday, 12 September 2026 12:09:26 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

కలెక్టర్ సారూ కనుకరించండి - నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి - పీజీఆర్ఎస్ లో వృద్ధురాలు కొండామర్రి లక్ష్మమ్మ వినతి

Date : 07 September 2026 08:12 PM Views : 41

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలెక్టర్ సారూ కనుకరించండి - నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి - పీజీఆర్ఎస్ లో వృద్ధురాలు కొండామర్రి లక్ష్మమ్మ వినతి మదనపల్లె : కలెక్టర్ సారూ కనుకరించండి అంటూ డోర్ నెంబర్ ఎఎ/27/441 కోళ్లబైలు పంచాయతీ,వైయస్సార్ కాలనీలో నివాసం ఉండే లేట్ కొండామర్రి వెంకటరమణ భార్య కొండామర్రి లక్ష్మమ్మ సోమవారం పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టరుకి వినతిపత్రం అందజేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేనెంబర్ 665/666లో ప్లాట్ నెంబర్ 11ను ఎ.సుజాత అనే ఆమెకు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.అయితే ఆమె ఈ స్థలంలో ఇళ్లు నిర్మించుకోకుండా మరోచోట నిర్మించుకున్నారని దీంతో ఆ ప్లాటును ప్రభుత్వం వారు 2008లో తనకు కేటాయించారని తెలిపారు.సదరు స్థలంలో తాను ఇళ్లు నిర్మించుకొని చాపల మగ్గం నేసుకుంటూ జీవనం సాగిస్తున్నానన్నారు,ఎఎ/27/441 డోర్ నెంబరుపై విద్యుత్ శాఖ వారు కరెంట్ సర్వీసు ఇచ్చారని,ఇంటి పన్ను సైతం చెల్లించడం జరిగిందన్నారు.ఇటీవల విద్యుత్ కనెక్షన్ తొలగించగా తాను స్థానిక ఎమ్మెల్యేని సంప్రదించగా సత్వరమే స్పందించి విద్యుత్ కనెక్షన్ ఇప్పించి అండగా నిలిచారన్నారు.అయితే గతంలో మంజూరు చేసిన సుజాత కుమారుడు ఈ స్థలం తనదేనంటూ చెబుతున్నాడని,స్థానికంగా కొందరు ఇంటిని ఖాళీ చేయమని పదేపదే ఇబ్బంది పెడుతున్నారని కన్నీరుమున్నీరుగా విలపించింది.నాకు కుమార్తెలు,కుమారుడు ఉన్నప్పటికీ వారు మరోచోట జీవిస్తున్నారని,నాకు దిక్కెవరు లేరని తెలిపారు.కావున ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ స్పందించి తనకు శాశ్వత పరిష్కారం చూపాలని,తన ఇంటి స్థలంపై సర్వహక్కుల కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :