నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 03 : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని టిడిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈనెల 15వ తారీకు నుండి జులై ఆఖరి వరకు 45 రోజులు రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రతి గడపలో గళం విప్పాలని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి కోరారు. బుధవారం కోసువారి పల్లి, తంబళ్లపల్లె, కోటకొండ, గుండ్లపల్లి, గోపి దీన్ని, ఎద్దుల వారి పల్లె క్లస్టర్ల యూనిట్ పరిధిలో క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు నరసింహులు నాయుడు, బేరి శ్రీనివాసులు, సిద్ధమ్మ, కాలా నారాయణ, కృష్ణమూర్తి నాయుడు, రామచంద్ర, గురుమూర్తి, బిఎంఆర్, గ్రామ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించి 45 రోజుల రెండేళ్ల అభివృద్ధి పల్లె బాట కార్యక్రమానికి టిడిపి కార్యకర్తల సమావేశాలు నిర్వహణ, ప్రజలకు అవగాహన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా బూత్ కమిటీ ఇన్చార్జీలు, కమిటీలు నియామకాలు చేపట్టారు. ఈ ప్రజా చైతన్య బాటలో టిడిపి శ్రేణులు పార్టీ సిద్ధాంతమే అజెండాగా విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంతో కూటమి నాయకుల సమన్వయంతో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రజల అభిమానాన్ని చూర గొనాలని క్లస్టర్ యూనిట్ సమావేశాలలో నాయకులు తీర్మానాలు చేసి చేయి చేయి కలిపారు
Reporter
Namitha News