నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 12 : రామసముద్రం మండలం ఎగువ నల్లప్పగారిపల్లి గ్రామంలో శుక్రవారం బయోఫ్యాక్టర్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు ప్రత్యక్షంగా బయోఫ్యాక్టర్, జీవన, సేంద్రీయ ఎరువుల ప్రభావాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉత్పత్తులను వాడటం వలన భూమి ఆరోగ్యం మెరుగుపడుతూ పంటలు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. బయోఫ్యాక్టర్ కంపెనీ రీజినల్ మేనేజర్ బి. గంగాధర్ నాయుడు మాట్లాడుతూ, మా ప్రధాన లక్ష్యం ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించడం. పొలాల్లో భూమి ఆరోగ్యం మెరుగైనప్పుడు పంటలకు అధిక శక్తి, మంచి అభివృద్ధి మరియు ఎక్కువ దిగుబడులు లభిస్తాయి అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News