నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 11 : తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి సచివాలయం లో చైర్మన్ పెద్ద శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వాటర్షెడ్ మహోత్సవం రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఓ కాజా మొహిద్దిన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత, మట్టి పాడు, వర్ష నిర్భర వ్యవసాయం సమస్యలకు వాటర్ షెడ్ తో పరిష్కారం అయినట్లు చెప్పారు. వాటర్ షెడ్ లో సహజంగా వర్షపు నీరు చేరే ప్రాంతంలో నీటి నిల్వ, నేలను కాపాడడం, వనరులను సమర్ధవంతంగా వినియోగించడం వాటర్ షెడ్ ముఖ్య ఉద్దేశం అన్నారు. అనంతరం వాటర్ షెడ్ లో నిర్మించిన నీటి వనరుల వద్ద ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మౌలాలి, వాటర్ షెడ్ మెంబర్లు,డబ్ల్యూ సి సిబ్బంది ఆంజనేయులు, సాంబశివ,రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News