Wednesday, 29 July 2026 06:27:56 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

అలా అయితే ప్రభుత్వ ఉద్యోగం ఊస్ట్ -రేవంత్ సర్కార్ కొత్త నిబంధనలు

Date : 02 December 2025 02:58 PM Views : 275

నమిత న్యూస్ - Andhra Pradesh / Hyderabad : హైదరాబాద్ - డిసెంబర్ 02 : ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, ఇష్టానుసారంగా సెలవులు పెట్టడంపై పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముఖ గుర్తింపు హాజరు (FRS) విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల హాజరు, అనధికారిక గైర్హాజరు వివరాలపై విద్యాశాఖ దృష్టి సారించింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ సోమవారం డీఈవోలతో ఆన్‌లైన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒక ఉపాధ్యాయుడు అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా, చెప్పా పెట్టకుండా నెల రోజులపాటు విధులకు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి అని డీఈవోలకు సూచించారు. వాస్తవానికి ఒక్క రోజు అనధికార గైర్హాజరుపైనా చర్యలు తీసుకోవచ్చు. అయినప్పటికీ ఉపాధ్యాయులు అనారోగ్యం లేదా ప్రమాదం వంటి సాకులు చెప్పి కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ఉన్నందున.. నెల రోజుల గడువు తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణ జరిపి తొలగించాలని నిర్ణయించారు. తొలగింపు వివరాలను గెజిట్‌లో కూడా ప్రచురించాలని ఆదేశించారు. గత ఆగస్టు నుంచి అమలులో ఉన్న FRS విధానం ద్వారా టీచర్లు పాఠశాలకు వచ్చిన, వెళ్లిపోయిన సమయం కచ్చితంగా నమోదవుతోంది. ఇప్పటివరకు కేవలం హాజరు అయ్యారా లేదా అనే దానిపైనే దృష్టి పెట్టగా.. ఇకనుంచి ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులపైనా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. FRS అమలుతో కొంత ఆలస్యంగా వస్తా.., ముందుగా వెళ్తా.. అని అడిగే మొహమాటాలు హెచ్‌ఎంలకు తప్పాయని, భవిష్యత్తులో సమయపాలనపై మరింత పకడ్బందీగా చర్యలు ఉంటాయనే భావన ఉపాధ్యాయుల్లో ఏర్పడిందని గెజిటెడ్ హెచ్‌ఎంలు చెబుతున్నారు. దీర్ఘకాలిక సెలవులు తీసుకొని, వాటిని పొడిగించుకోకుండా ఒకటి, రెండేళ్ల పాటు విధులకు హాజరు కాని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కువగా విదేశాల్లోని తమ పిల్లలు లేదా భాగస్వాముల వద్దకు వెళ్లేందుకే ఈ సెలవులు తీసుకుంటున్నారు. అలాంటి వారిని గత రెండేళ్లలో సుమారు 50 మందిని విద్యాశాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 24 వేల పాఠశాలల్లో 1.15 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా.. వీరిలో 6,100 మంది డిప్యుటేషన్లపై ఇతర విభాగాల్లో ఉన్నారు. దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న మిగిలిన ఉపాధ్యాయులను కూడా గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు డీఈవోలను ఆదేశించారు. ఈ కొత్త నిబంధనల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, హాజరు మెరుగుపడుతుందని విద్యాశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: