నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 02 : మొలకల చెర్వు కల్తీ మద్యం కేసు లో కూడా వైసీపీ నేత జోగి ను రమేష్ ను ముద్దాయి గా చేర్చిన ఎక్సయిజ్ పోలీసులు. నెల్లూరు సబ్ జైలు లో నున్న జోగి రమేష్ ను పి. టి. వారెంట్ పై భారీ బందోబస్త్ తో నేడు తంబళ్లపల్లి కోర్టు లో హాజరుపర్చిన ఎక్సయిజ్ పోలీసులు. జోగి రమేష్ కు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. వైసీపీ నేత ను తంబళ్లపల్లి కి తీసుకోనివస్తున్నారన్న సమాచారం తో భారీగా తంబళ్లపల్లి కి చేరుకొన్న వైసీపీ నాయకులు. కూటమి అరాచకాలను గమనిస్తున్న ప్రజలు తగిన బుద్ది చెప్పుతారని చర్చించుకొంటున్న కార్యకర్తలు ఈ సందర్బంగా ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు కల్తీ మద్యం తో పేదల రక్తం తాగిందే కాకుండా అసలు ముద్దాయిలను ఇంతవరకూ అరెస్టు చేయకుండా వైసీపీ నేతలను ముద్దాయిలు చేస్తూ రిమాండ్ కు తరలిస్తూ వేదిస్తున్నారని ప్రజలు అంతా గమనిస్తున్నారు సరైన గుణపాఠం చెప్తారని తెలిపిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి
Reporter
Namitha News