నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 07 : మదనపల్లి పట్టణం బెంగళూరు బస్టాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డులలోని ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించిన పరిశీలకులు గురుమూర్తి గౌడ్, సురేష్ తదితరులు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారద్యం లో సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల హామీలను వేరుస్తున్నాం, మదనపల్లి జిల్లా ను ఇచ్చాం, ప్రతీ ఒక్క నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల మధ్యలోనే ఎక్కువ కాలం పనిచేయండి, ప్రజల మన్ననలు పొందండి రాబోయే మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వార్డు తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి, మునిసిపాలిటీ లో టిడిపి జండా ఎగుర వేయాలని దిశా నిర్దేశం చేసిన నాయకులు.
Admin
Namitha News