నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 29 : తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాలలో ఆరు మోటార్ సైకిళ్లు చోరీ చేసిన దొంగను తంబళ్లపల్లె పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. తంబళ్లపల్లె కు చెందిన రాజ్ కుమార్ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఆరు మోటార్ సైకిళ్లు చోరీకి పాల్పడ్డాడు. తంబళ్లపల్లె పోలీసులు శనివారం నిందితున్ని అదుపులోకి తీసుకొని ఆరు మోటార్ సైకిళ్లు ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ములకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి విలేకరులకు తెలిపారు. మోటార్ సైకిళ్ల చేధనలో కృషి చేసిన ఎస్సై టి అనిల్ కుమార్ తో పాటు సిబ్బందిని సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశంసించారు
Reporter
Namitha News