నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 30 : తంబళ్లపల్లె మండలం లో గురువారం వెలువడిన టెన్త్ పరీక్ష ఫలితాలలో 85. 90% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మోడల్ స్కూల్లో 59 మంది కి 52 మంది పాసై ఏడు మంది ఫెయిల్ అయి 88% సాధించగా ప్రధమ శ్రేణి లో 565, ద్వితీయ శ్రేణి 564, తృతీయ శ్రేణి 552 మార్కులు సాధించారు. ఎస్టి గురుకులంలో 9 మందికి ఏడు మంది పాసై ఇద్దరు ఫెయిల్ కాగా 78 శాతం, 392,357,314, మార్కులు.కస్తూరిబా బాలికల స్కూల్లో 37 మందికి 35 మంది పాసై ఇద్దరు ఫెయిల్ అయి 95% 558, 550, 540 మార్కులు, బీసీ వెల్ఫేర్ స్కూల్లో 66 మందికి 64 మంది పాసై ఇద్దరు ఫెయిల్ అయి 97% 572, 563,555 మార్కులు. బలక వారి పల్లి హైస్కూల్లో 6 మందికి 5 మంది పాసై ఒక్కరు ఫెయిల్ అయి 83% 563,523, 490 మార్కులు. గోపి దీన్నే హైస్కూల్లో 20 మందికి 13 మంది పాసై ఏడు మంది ఫెయిలై 65% 474, 457,442 మార్కులు, కన్నెమడుగు హైస్కూల్లో 43 మంది కి 36 మంది పాసై ఏడు మంది ఫెయిలై 84% 582, 557, 556 మార్కులు. కోసువారిపల్లి హైస్కూల్లో 22 మందికి 17 మంది పాసై ఐదు మంది ఫెయిలై 77% 540, 529, 506 మార్కులు.రేణుమాకులపల్లి హైస్కూల్ 10మందికి ఏడు మంది పాసై ముగ్గురు ఫెయిలై 70 శాతం 536 , 448, 401 మార్కులు. తంబళ్లపల్లె హై స్కూల్లో 48 మందికి 39 మంది పాసై 9మంది ఫెయిల్ అయి 81.25 శాతం మొదటి శ్రేణిలో 568, ద్వితీయ శ్రేణిలో561, తృతీయ శ్రేణిలో536 మార్కులు సాధించారు. కన్నె మడుగు హై స్కూల్ కు చెందిన ఎం ప్రణీత 582/600 మండల మొదటి స్థానంలో నిలవగా బీసీ వెల్ఫేర్ స్కూల్ కు చెందిన వి రాజేష్ 572/600 ద్వితీయ స్థానం, తంబళ్లపల్లె హైస్కూల్ కు చెందిన హేమ దీక్షిత 568/600 తృతీయ స్థానం మార్కులు సాధించారు .మండలంలోని మొత్తం 320 మంది విద్యార్థులకు 275 మంది పాసై 45 మంది ఫెయిలై 85.90% ఉత్తీర్ణత సాధించారు. బీసీ వెల్ఫేర్ పాఠశాల 97% తో ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలవగా గోపి దీన్నే హైస్కూల్ 65శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలవడం విశేషం
Reporter
Namitha News