Tuesday, 15 September 2026 08:55:41 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

పండుగ జ్ఞాపకాలతో సురక్షితంగా వెళ్లండి - క్షేమంగా గమ్యం చేరండి - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

తిరుగు ప్రయాణీకులకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వారి ఆత్మీయ విన్నపం

Date : 16 January 2026 09:03 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / : రాయచోటి - జనవరి 16: సంక్రాంతి సంబరాలు ముగిశాయి. పల్లె సీమల్లోని ఆత్మీయతలు, పిండివంటల రుచులు, బంధుమిత్రుల పలకరింపులతో నిండిన తీపి జ్ఞాపకాలను మూటగట్టుకుని అన్నమయ్య జిల్లా ప్రజలు తిరిగి తమ గమ్యస్థానాలకు బయలుదేరుతున్నారు. అయితే, మీ తిరుగు ప్రయాణం సంతోషంగా సాగాలని, ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలని *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ఆకాంక్షించారు.* ఈ సందర్భంగా ప్రయాణీకులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆయన ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. "పండుగ తెచ్చిన ఉత్సాహం ప్రయాణంలోనూ కొనసాగాలి. తొందరపాటుతో చేసే చిన్న పొరపాటు మీ కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చకూడదు. అందుకే ప్రయాణంలో క్రమశిక్షణ పాటించండి" అని ఎస్పీ గారు కోరారు. రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండే సమయం ఇది. అందుకే నిర్ణీత వేగంతో ప్రయాణించండి. గమ్యం చేరడం కంటే క్షేమంగా చేరడం ముఖ్యం. సుదీర్ఘ దూరం ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా రాత్రి వేళల్లో నిద్రమత్తుగా అనిపిస్తే వెంటనే వాహనాన్ని సురక్షితమైన చోట ఆపి విశ్రాంతి తీసుకోండి. బస్సుల్లో, రైళ్లలో వెళ్లేవారు కొత్త వ్యక్తులు ఇచ్చే బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ వంటివి ఆశించవద్దు. మత్తు మందు ఇచ్చి దోచుకునే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి. ఇది మీ ప్రాణానికి రక్షణ కవచం. పండుగ సరదాలో మద్యం సేవించి స్టీరింగ్ పట్టుకోవడం చట్టరీత్యా నేరమే కాదు, అది ఆత్మహత్యాసదృశ్యం. "మీ ప్రయాణ మార్గంలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా, లేదా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సంకోచించకుండా, స్థానిక పోలీస్ స్టేషన్, లేదా డయల్ 112 కి సమాచారం అందించండి. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు మీకు తోడుగా ఉంటాయి" అని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు. పండుగ వేడుకలు ఇచ్చిన నూతనోత్సాహంతో అందరూ క్షేమంగా తమ గమ్యం చేరాలని, మీ ప్రయాణం సుఖమయంగా సాగాలని అన్నమయ్య జిల్లా పోలీస్ కుటుంబం మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోంది

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :