Wednesday, 17 June 2026 03:24:53 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర

Date : 16 June 2026 11:18 PM Views : 15

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 16 : ఇండియన్ బ్యాంక్ ల ఆర్థిక లావాదేవీల తో పాటు అభివృద్ధిలో వెలుగు సంఘమిత్రలదే కీలకపాత్ర ని ఇండియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఇందిర ప్రశంసించారు. సోమవారం వెలుగు కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో వెలుగు సంఘమిత్రల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తంబళ్లపల్లె, కోసువారిపల్లె ఇండియన్ బ్యాంకుల పరిధిలో మహిళా సంఘాలు రుణాల సద్వినియోగంలో సత్ఫలితాలు సాధించినట్లు చెప్పారు. బ్యాంకు లింకేజీ తో పాటు పలు రకాల రుణాలను అందించడానికి బ్యాంకులు సహకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక ఏడాదిలో 33 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ కి వెలుగు ఏపిఎం తోబాటు సీసీలు, వివో లీడర్లు, సభ్యులు, సంఘమిత్రలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా బ్యాంక్ పరంగా మహిళా సంఘాల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకు రుణాలు పంపిణీలో పారదర్శకత పాటించి భవిష్యత్తులో ప్రతి మహిళ లక్షాధికారి కావడమే లక్ష్యంగా తమ సహకారం ఉంటుందన్నారు. ఏపీఎం మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ లు మహిళా సంఘాలకు అందించిన రుణ సౌకర్యంపై కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె, కోసువారిపల్లి మేనేజర్లు ఎస్ ఎన్ డి మంజూర్ ఇలాహి, నాగరాజు, ఐకెపి అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ,సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, వివో లీడర్లు, సంఘమిత్రలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: