నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 30 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎన్.సీ.సీ మరియు అసోసియేట్ ఎన్.సీ.సీ ఆఫీసర్ (ANO)ల సమావేశం ను (Conclave) నిర్వహించారు . ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్స్ మరియు కళాశాల నుంచి 250 మందికి పైగా ఎన్సీసీ, ఏఎన్వోలు మరియు క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి చిత్తూర్ 35 (ఎ) బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మోనిస్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కల్నల్ ఎన్.వి. మోనిస్ క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ నైపుణ్యాల అభివృద్ధి మరియు యువత సామాజిక అభివృద్ధిలో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన అవసరాన్ని వివరించారు. లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ సాయుధ దళాల్లో ఉన్న వివిధ కెరీర్ అవకాశాలపై విలువైన మార్గదర్శకత్వాన్ని అందించారు. ఎన్.సీ.సీ లో శిక్షణ పొందిన విద్యార్థులకు భారత సైన్య విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని. ఎన్.సీ.సీ ‘C’ సర్టిఫికేట్ ఉన్నవారు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని కొన్ని పోస్టులకు రాత పరీక్ష లేకుండా లేదా ప్రత్యేక ప్రవేశాల ద్వారా ఎంపికకు అర్హులు అవుతారని అన్నారు. నేటి ఆధునిక సైన్యంలో డ్రోన్లు, రాడార్లు, శాటిలైట్లు, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరికరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గ్రామీణ ప్రాంత ఎన్.సీ.సీ విద్యార్థులకు క్యాంపులను ఏర్పాటు చేయడం ద్వారా ఎన్.సీ.సీ క్యాడెట్లలో సమస్యలను త్వరగా పరిష్కరించే సామర్థ్యం, కొత్త విషయాలను అర్థం చేసుకునే శక్తి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అని అన్నారు. కార్యక్రమానికి పలమనేరు ఎస్ వి సి ఆర్, చిత్తూర్ పి.వి.కే.యెన్, పుంగనూరు ఎస్ ఆర్ జి డి సి మరియు మదనపల్లి బి టి కాలేజీ ఎన్.సీ.సీ విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి, గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్,మిట్స్ ఎన్.సీ.సీ కెప్టెన్ యెన్ నవీన్ కుమార్, మిట్స్ ఎన్.సీ.సీ విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News