Wednesday, 29 July 2026 03:29:13 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ లో ఆన్ లైన్ లో NPTEL పరీక్ష

Date : 28 March 2026 10:08 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 28 : సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు విద్యార్థులు మరియు అధ్యాపకులకు సాంకేతిక, విజ్ఞాన మరియు మేనేజ్‌మెంట్ రంగాలలో ఆన్‌లైన్‌ ద్వారా నాణ్యమైన విద్య పై అవగాహన పెంపొందించుకోవడానికి నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్(NPTEL) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు వారు స్వయం అను పేరుతో నిర్వహించిన సర్టిఫికెట్ కోర్స్ ఆన్లైన్ పరిక్షను యూనివర్సిటీలో నిర్వహించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్. సి. యువరాజ్ తెలిపారు. శనివారం నిర్వహించిన ఈ పరీక్ష లు యూనివర్సిటీ ప్రాంగణం లో నిర్వహించారని, ఈ ఆన్లైన్ పరీక్షకు 1,037 మంది నమోదు చేసుకోగా 1,010 మంది హాజరు అయినట్లు, 27 మంది గైర్హాజరు అయినట్లు ఆయన అన్నారు. వివిధ సబ్జెక్ట్స్ లో ఆన్లైన్ పరీక్షల ను యెన్.పీ.టి.ఈ.ఎల్ (NPTEL) వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారని ఆయన అన్నారు. ఈ పరీక్షలలో ఉతీర్ణులు అయిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఆన్లైన్ సర్టిఫికెట్ ను యెన్.పీ.టి.ఈ.ఎల్ (NPTEL) వారు అందజేస్తారని, ప్రతి ఏటా తమ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పరీక్షలు రాస్తారని ఆయన వివరించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :