నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 28 : సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు విద్యార్థులు మరియు అధ్యాపకులకు సాంకేతిక, విజ్ఞాన మరియు మేనేజ్మెంట్ రంగాలలో ఆన్లైన్ ద్వారా నాణ్యమైన విద్య పై అవగాహన పెంపొందించుకోవడానికి నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్(NPTEL) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు వారు స్వయం అను పేరుతో నిర్వహించిన సర్టిఫికెట్ కోర్స్ ఆన్లైన్ పరిక్షను యూనివర్సిటీలో నిర్వహించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్. సి. యువరాజ్ తెలిపారు. శనివారం నిర్వహించిన ఈ పరీక్ష లు యూనివర్సిటీ ప్రాంగణం లో నిర్వహించారని, ఈ ఆన్లైన్ పరీక్షకు 1,037 మంది నమోదు చేసుకోగా 1,010 మంది హాజరు అయినట్లు, 27 మంది గైర్హాజరు అయినట్లు ఆయన అన్నారు. వివిధ సబ్జెక్ట్స్ లో ఆన్లైన్ పరీక్షల ను యెన్.పీ.టి.ఈ.ఎల్ (NPTEL) వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారని ఆయన అన్నారు. ఈ పరీక్షలలో ఉతీర్ణులు అయిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఆన్లైన్ సర్టిఫికెట్ ను యెన్.పీ.టి.ఈ.ఎల్ (NPTEL) వారు అందజేస్తారని, ప్రతి ఏటా తమ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పరీక్షలు రాస్తారని ఆయన వివరించారు
Reporter
Namitha News