Wednesday, 17 June 2026 03:27:45 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం

Date : 15 June 2026 09:32 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 15 : మల్లయ్య కొండ మహాశివుని సన్నిధిలో సోమవారం మహిళా కళాకారులు మల్లయ్య కొండల మైనింగ్ పై వ్యతిరేకిస్తూ కొండల సంరక్షణకు సహకరించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. ప్రతిరోజు మల్లయ్య కొండ శివాలయంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాటు ఇతర జిల్లాల నుండి వందలాదిగా చెక్కభజన, కోలాటాలు, సంకీర్తనలు చేసే బృందాలు తమ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం మహిళా కళాకారులు ఎమ్మెల్యే తో మహాశివుడు మన అందరికీ ఆరాధ్య దైవమని నాటికి నేటికీ ఆయన శివనామ స్మరణే మాకు శరణ్యమని అలాంటి దేవదేవుని కొండలను కూలుస్తామంటే సహించమన్నారు. కొండలను కాపాడడానికి మా వంతు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యేగా మీరు అండగా నిలబడి రాగద్వేషాలకతీతంగా సమిష్టిగా ఆ ముక్కంటి మహా శివుని కోసం పోరాడితే పోయేదేంలేదని ఎంతటి త్యాగానికైనా సిద్ధమని హర్షద్వానాల మధ్య శపథం చేశారు. మైనింగ్ చర్యలపై మహిళా కళాకారుల చెప్పిన మాటలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ముగ్ధుడై కొండల సంరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నీ ప్రోత్సాహంతో మైనింగ్ చర్యలు ఆపడానికి ముందుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మహిళా కళాకారులు, శివ భక్తులు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :