నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం చెంబకూరు గ్రామ పంచాయతీ కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో స్వచ్చ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సచివాలయ ప్రాంగణంలోని పరిసరాలను శుభ్రం పరచడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజ,పంచాయతీ కార్యదర్శి రెడ్డిశేఖర్,విఆర్వో రమణ, అగ్రికల్చర్ ఆఫీసర్ అహ్మద్, మహిళ పోలీస్ చందన, డిజిటల్ అసిస్టెంట్ రేవతి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ హరీష్, వెల్ఫేర్ అసిస్టెంట్ అనూష, రంగాని వెంకటేష్,కొండప్ప,రమణ, జన, పారిశుద్ద్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News