నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - అక్టోబర్ 06 ః పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచడంపై సోమవారం తంబళ్లపల్లె మండల కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పట్నాయక్, ఏవో థామస్ రాజాలు మాట్లాడుతూ పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్వచ్ఛత భారత్ కార్యక్రమంలో పాల్గొని పారిశుధ్యం పై ప్రజలను చైతన్య పరచాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఈ ఓ ఆర్ డి ఈశ్వర్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరావు, సర్పంచ్ నీలూఫర్, పద్మావతి, మనోహర్, భాస్కర్, మస్తాన్, వసంతమ్మ, రాజమ్మ, భాష లు పాల్గొన్నారు
Reporter
Namitha News