Sunday, 13 September 2026 03:55:48 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

A 1 వెహికల్ సర్వీసింగ్ పాయింట్ ను ప్రారంభించిన టీడీపీ నేతలు

Date : 21 January 2026 02:27 PM Views : 231

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 21 : ఆత్మకూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన A1 వెహికల్ సర్వీసింగ్ పాయింట్ ను ప్రారంభించిన స్థానిక తెలుగుదేశం నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ పక్కన పట్టణవాసి పఠాన్. ఆజ్గర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ వన్ (A1) వెహికల్ మరియు వాటర్ సర్వీసింగ్ పాయింట్ ను నేడు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మండల ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షులు గొట్టిగుండాల బుజ్జిరెడ్డి, వెంకటయ్య, పిడికిటి వెంకటేశ్వర్లు,సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, జర్నలిస్టులు చిట్టమూరు.సుబ్బారెడ్డి, దీపోగు.బాబు, ఖాసీం, బాదుల్లా, మహబూబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా తాము నూతనంగా ఏర్పాటుచేసిన ఈ వాటర్ సర్వీసింగ్ పాయింట్ ప్రాణభానికి విచ్చేసిన తమ ఆత్మీయులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తమ షాపు లో స్కూటర్లు, కార్లు ఇతర వాహనాలను అధునూతన పద్ధతిలో వాటర్ సర్వీసింగ్ చేసి వాహనాలను అందంగా సిద్ధం చేస్తామని వీటితోపాటు స్కూటర్ రిపేర్లు, పంచర్లు, బైక్ పాలిషింగ్, స్టిక్కరింగ్ తదితర సర్వీసులను చేస్తామని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నిర్వాహకులు పటాన్. అజ్గర్ తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :