Wednesday, 29 July 2026 05:19:30 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

పుస్తకాల గొడవ - విద్యార్థిపై మరో విద్యార్థి చాకుతో దాడి @ మెడకు 8 కుట్లు

Date : 25 June 2026 06:47 PM Views : 76

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వాల్మీకిపురం : వాల్మీకి పురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య పుస్తకాల విషయంలో జరిగిన గొడవ తీవ్ర ఘటనకు దారితీసింది. మండలంలోని గొల్లపల్లికి చెందిన విద్యార్థి హర్షవర్ధన్ పుస్తకాలను పట్టణానికి చెందిన విద్యార్థి భరత్‌రాజ్ దొంగిలించినట్లు సమాచారం. ఈ విషయమై భరత్ రాజ్ ను హర్షవర్ధన్ నిలదీయడంతో ఇద్దరి మధ్య మంగళవారం వాగ్వాదం జరిగింది. బుధవారం ఉదయం భరత్‌రాజ్ రూ.5 వెచ్చించి చిన్న చాకును కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకువచ్చాడు. హర్షవర్ధన్ రానీ ఈరోజు వాడి కథ చూస్తానంటూ తోటి విద్యార్థుల వద్ద హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం తరగతి గదిలోకి వచ్చిన హర్షవర్ధన్ పుస్తకాలు కింద పెట్టేందుకు వంగిన సమయంలో భరత్‌రాజ్ చాకుతో హర్షవర్ధన్ మెడపై బలంగా కోశాడు. దీంతో హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడి రక్తస్రావం అయ్యింది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, విద్యార్థులు అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడపై దాదాపు 8 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధిత విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :